కేసీఆర్ సర్కార్‌ కీలక నిర్ణయం.. మరో భారీ ప్రక్షళన దిశగా అడుగులు..!

Spread the love

కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో ప్రక్షళనలో భాగంగా.. మరో ముందడుగ వేసింది. శనివారం నుంచి దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. దేవాదాయ భూములు, వక్ఫ్‌ బోర్డు భూముల క్రయ,విక్రయాలను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దేవాదాయ, వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఆటోలాక్‌ చేస్తామన్నారు.ఆలయ భూములు, వక్ఫ్‌ బోర్డు భూములను పరిరక్షించే క్రమంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు.


Spread the love
error: Content is protected !!