తమిళనాడులో గణేష్ మండప నిర్వాహకులపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కోయంబత్తూరు ప్రాంతంలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసిన సంస్థలపై, సంఘాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా స్థానిక హిందూ మున్నని, విశ్వ హిందూ పరిషత్ సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం కోయంబత్తూరు ప్రాంతంలో 25 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
హైకోర్టు తీర్పును ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో మండపాలకు అనుమతి లేదని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయన్నారు. మండప నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో పాటుగా.. విగ్రహాలను అక్కడి నుంచి తొలగించి.. నిమజ్జనం పూర్తయ్యిందని పోలీసులు తెలిపారు. అయితే ఇళ్లల్లో విగ్రహాలను పెట్టుకోవచ్చని..సామూహిక నిమజ్జనం కాకుండా.. ఎవరికి వారుగా నిమజ్జనం చేయడానికి అనుమతించారు.