మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫోటోను వైరల్ చేస్తున్న కాంగ్రెస్.. నిజం ఏంటంటే..?

Spread the love

ప్రస్తుతం గత సోమవారం భారత్‌-చైనా జవాన్ల మధ్య గాల్వాయ్‌ లోయలో జరిగిన.. మన దేశంలో రాజకీయ దుమారం లేపుతోంది. మొన్నటి శుక్రవారం ఆల్‌ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. అయితే చైనా గాల్వన్‌ లోయ తమదేనంటూ ప్రకటించడం.. చర్చనీయాంశమైంది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ.. శాంతిని కోరకుంటున్నాం.. కానీ అదే సమయంలో ఒక్క ఇంచు స్థలం కూడా కోల్పోయేది లేదని చెప్పకనే చెప్పేశారు. ఇదే విషయంపై కేంద్ర విదేశాంగ మంత్రి కూడా ప్రకటన చేశారు. అంతేకాదు.. సైన్యానికి ఫ్రీహ్యాండ్స్ ఇచ్చేశారు. అత్యవసరంగా డిఫెన్స్ భద్రత పెంపుకు రూ.500 కోట్లు కూడా విడుదల చేసినట్లు సమాచారం. ఇదంతా ఇలావుంటే.. ఇప్పుడు మాజీ ప్రధాని ఇంధిరా గాంధీకి చెందిన ఓ పాత్ర చిత్రాన్ని వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోను కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ… ఆ నాడు గాల్వన్ ప్రాంతంలో సైన్యంతో భారీ బహిరంగ సభను మాజీ ప్రధాని ఇందిరా పెట్టారంటూ పోస్ట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న
చిత్రాన్ని యూపీ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్‌తో పాటు.. యూత్ కాంగ్రెస్ ట్విట్టర్‌ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు దానిని రీట్వీట్‌ చేయడంతో పాటు.. షేర్స్ చేస్తున్నారు. గతంలో భారత సైనికులనుద్దేశిస్తూ గాల్వన్ లోయలో మాజీ ప్రధాని ఇందిరా ప్రసంగం చేశారని పోస్ట్ చేశారు. ఇది ఆదివారం నుంచి తెగ వైరల్ అవుతోంది.

అయితే ఈ వైరల్ న్యూస్‌కు ఫ్యాక్ట్‌ చెక్ అడ్డుపడింది.కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్న ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో.. గాల్వన్‌ లోయలో జరిగిన మీటింగ్‌కు సంబంధించినది కాదని..1971లో లేహ్‌లో జరిగిన సమావేశానికి సంబంధించినది తెలిపింది. అంతేకాదు.. లేహ్‌ నుంచి గాల్వన్‌ లోయ దాదాపు 220 కిలో మీటర్ల దూరంలో ఉంటుందని తెలిపింది. ఈ ఫోటో
గాల్వన్‌లోయకు చెందినదంటూ కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తుందని పేర్కొంది.దీనికి సంబంధించిన ఫోటో.. పీటీఐ వెబ్‌సైట్‌లోని ఫోటో గ్యాలరీలో ఉంది. ఈ చిత్రం 1971లో లేహ్ ప్రాంతంలో తీసినట్లు సమాచారం.

 

 


Spread the love
error: Content is protected !!