ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు వేల మంది ప్రాణాలను బలిగొంది. మరో లక్షన్నర మందికి పైగా ఈ వైరస్ సోకి ఆసుపత్రి పాలయ్యారు. మనదేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ సందర్బంగా సినీ నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ విజయ శాంతి స్పందించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. వదంతులను ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసారు. ఈ కరోనా పంజా విసురుతున్న సమయంలో.. ప్రభుత్వాలు అన్ని వర్గాలకూ సమానంగా చికిత్స అందేలా… ప్రజల భద్రత కోసం సరైన తీరులో జాగ్రత్తలు వహిస్తాయని ఆశిస్తున్నానన్నారు.