అయోధ్యలో ప్రారంభమైన “భవ్య్ రామ్‌ మందిర్‌” నిర్మాణం..!

Spread the love

యావత్ హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న అయోధ్య రామ మందిర నిర్మాణం.. ఎట్టకేలకు మంగళవారం ప్రారంభమైంది. గతేడాది నవంబర్ మాసంలో.. అయోధ్య రామ మందిర విషయమై తీర్పు వెలువరిన సంగతి తెలిసిందే. అయితే ఈ మందిర నిర్మాణానాకి సంబంధించి.. ప్రభుత్వం సమక్షంలోనే ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టుకు చైర్మన్‌గా నృత్య గోపాల్ దాస్ ఉండగా.. వీహెచ్పీ నేత చంపత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇక మంగళవారం రోజున.. ఉదయం రామ మందిర నిర్మాణం పనుల్ని ప్రారంభించారు. తొలుత రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్.. పూజలు నిర్వహించారు. ఆ తర్వాత.. మందిర నిర్మాణ విషయం గురించి ప్రకటించారు. నిర్మాణ పనులు ప్రారంభమవ్వడంతో.. రామ్‌లల్లా విగ్రహాలను అయోధ్యలోని మానస్‌భవన్‌కు తరలించినట్లు తెలిపారు. పల్లకిలో ఊరేగిస్తూ.. రామ్‌లల్లా విగ్రహాలను మానస్‌భవన్‌కు చేర్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు.. పలువురు ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.


Spread the love
error: Content is protected !!