ఆ మదర్సాలన్నీ పాఠశాలలుగా మార్చేయండి.. అధికారులకు సీఎం ఆదేశం..

Spread the love

అసోంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం హిమంత్‌ బిస్వా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ మదర్సాలన్నింటిని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా మార్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ విషయానికి సంబంధించి.. గతేడాది అధికారంలో ఉన్న అప్పటి బీజేపీ సీఎం సర్భంద్‌ సోనేవాల్‌ ఆధ్వర్యంలో చట్టాన్ని తీసుకువచ్చారు. దీనికి సంబంధించి డిసెంబర్ 30వ తేదీ 2020లో అసోం సభ మదర్సాలను పాఠశాలలుగా మార్చే మార్పిడి బిల్లును ఆమోదించింది.

అయితే ప్రస్తుతం కొత్తగా బాధ్యతలు చేపట్టిన హిమంత్‌ బిస్వా శర్మ దీనిని ఆచరణలో పెట్టారు. వెంటనే అధికారులు నిరుపయోగంగా ఉన్నమదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పరంగా ఇది చర్చనీయాంశంగా మారింది. మదర్సాలను పాఠశాలలుగా మార్చడమే కాదని.. వెంటనే పాఠశాలలకు అవసరమయ్యే ఉపాధ్యాయుల నియామకాన్ని కూడా చేపట్టాలని.. ఖాళీలు లేకుండా నిత్యం పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఇన్సిట్యూషన్స్‌ హెడ్‌కు అధికారాలను ఇచ్చారు. ఉపాధ్యాయుల నియామకం కావడమే కాకుండా.. వారంతా జూన్‌ 1వ తేదీన జీతం కూడా అందేలా చూడాలన్నారు. ఇక పెండింగ్‌లో ఉన్న స్కూటీ పంపిణీకి సంబంధించిన దాన్ని జూన్‌ 15వ తేదీ నాటికి పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అయితే ప్రైవేట్‌గా నడుస్తున్న మదర్సాలు యథావిధిగా నడుస్తుంటాయని.. అవి ఈ చట్టం కిందికి రావని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా నడిచే సుమారు 729 మదర్సాలు ఇప్పుడు ప్రాథమిక, ఉన్నత, ద్వితీయ మదర్సాలు ఇప్పుడు పాఠశాలలుగా మారాయి.


Spread the love
error: Content is protected !!