7 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. 20 వేలకు చేరువలో మరణాలు..

Spread the love

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 24,248 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,97,413కి
చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 425 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 19,693కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,53,287 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 4,24,433 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

 

కాగా, దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ఆ తర్వాత గుజరాత్, యూపీ, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్‌,కర్ణాటక రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి.


Spread the love
error: Content is protected !!