లాక్‌డౌన్‌ తర్వాత ఫస్ట్‌ రిలీజ్‌ అయ్యే మూవీ ఇదేనంటున్న రామ్‌గోపాల్‌ వర్మ

Spread the love

లాక్‌డౌన్‌ తర్వాత.. అన్‌ లాక్‌ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంట్లో సినిమా థియేటర్లకు, మల్టీప్లెక్స్‌లకు షరతులతో కూడిన అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే థియేటర్లు తెరుచుకున్న తర్వాత.. విడుదలయ్యే చిత్రాలు ఏమున్నాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దీనిపై క్లారిటీ ఇచ్చారు. థియేటర్లు తెరుచుకున్న తర్వాత.. విడుదలయ్యే తొలిచిత్రం తమదేనంటూ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

రామ్‌గోపాల్‌ వర్మ నిర్మించిన కరోనా వైరస్ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్‌ చేయబోతున్నట్లు గురువారం నాడు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ లాక్‌డౌన్‌ తర్వాత రిలీజ్‌ అయ్యే తొలిచిత్రం తమదేనంటూ చెప్పుకొచ్చారు.

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేల ఏటీటీల ద్వారా.. పలు చిత్రాలను రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరోనా వైరస్ పేరుతో ఓ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఈ కరోనా వైరస్‌ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. లాక్‌డౌన్‌ తర్వాత.. రిలీజ్‌ అవుతున్న తొలి చిత్రంగా కరోనా వైరస్‌ నిలుస్తుందని ఆర్జీవీ ఆశాభావం వ్యక్తం చేశారు.


Spread the love
error: Content is protected !!