దేశంలో రికార్డ్‌ స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. 40 లక్షలకు చేరువలో..

Spread the love

భారత్‌లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నిత్యం అరలక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్‌ తర్వాత.. భారత్‌లోనే అత్యధికంగా పాజిటివ్‌ కేసులు రికార్డ్‌ అవుతున్నాయి. ఇప్పటికే 39 లక్షల మార్క్‌ దాటి.. 40 లక్షలకు చేరువయ్యాయి.

తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 83,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,36,748కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు 30.37 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8.31 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Spread the love
error: Content is protected !!