దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. నిత్యం 80 వేల మార్క్ దాటి.. 90 వేలకు చేరువలయ్యేలావుంది. శనివారం నాటికి దేశ వ్యాప్తంగా 40 వేల మార్క్ను దాటేసింది. దీంతో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ను చేరువయ్యింది. ఇదే విధంగా మరో రెండు మూడు రోజులు కేసులు నమోదవుతే.. బ్రెజిల్ను కూడా దాటేసి.. రెండో స్థానంలోకి చేరేలా ఉంది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 86,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు 31.07 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8.46 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.