దేశంలో అరకోటికి చేరువైన పాజిటివ్ కేసులు..!

Spread the love

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు రికార్డులు బ్రేక్ చేసేలా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా తర్వాత మన భారత్‌లోనే అత్యధికంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా అత్యధికంగా కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గింది.

తాజాగా మరో 83,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,30,237కి చేరింది. దాదాపు అరకోటికి చేరువైంది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 38,59,400 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9.90 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Spread the love
error: Content is protected !!