దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు.. ఒక్కరోజే 95వేలకు పైగా..!

Spread the love

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రికవరీ రేటు కూడా పెరుగుతోంది. అయితే క్రమక్రమంగా దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు మన దేశంలో మరణాల శాతం అత్యల్పంగా ఉండటమే కాకుండా.. రికవరీ రేటు కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది.

తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 95,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44,65,864కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 34.71 లక్షల మందికి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9.1 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.


మరోవైపు రోజు వారిగా దేశ వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం రోజుకు పది లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు ఏకంగా 11 లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.


Spread the love
error: Content is protected !!