కరోనా వ్యాక్సిన్‌ రేట్‌ ఫిక్స్ చేసిన కేంద్రం‌.. ధర ఎంతో తెలుసా..?

Spread the love

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి భారత్‌.. వ్యాక్సిన్‌తో చెక్‌ పెడుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తొలి విడతగా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేశారు. అయితే రెండో విడతగా మార్చి 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ డ్రైవ్ ప్రారంభించనున్నారు. 60 ఏళ్ల పైబడ్డ వారితో పాటుగా.. 45 ఏళ్ల వయస్సు పైబడి దీర్ఘకాలిక వ్యాదులతో
బాధపడుతున్నవారికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

కేంద్ర ప్రకటించిన వ్యాక్సిన్‌ ధరల ప్రకారం.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్కో వ్యాక్సిన్‌ డోసు రూ.250గా ఉంటుందని ప్రకటించింది. ఇందులో రూ.150 వ్యాక్సిన్‌ ధర కాగా.. రూ.100 సర్వీస్‌ ఛార్జి ఉంటుందని కేంద్ర ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ధర రూ.250/- మించకూడదని తెల్పింది. ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రం ఉచింతగానే ఉంటుందని తెల్పింది.


Spread the love
error: Content is protected !!