దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ప్రజలు రోడ్లపైకి యథేచ్ఛగా వచ్చేస్తున్నారు. ఆ సమయాల్లో డ్యూటీలో ఉన్న పోలీసులు.. వారిని మందలించి ఇంటికి పంపిస్తున్నారు. అయితే వెస్ట్ బెంగాల్లో మాత్రం సీన్ రివర్స్ ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో నిబంధనలను పాటించకుండాఇ.. ఏకంగా ఇళ్లకు వెళ్లమని సూచించే పోలీసులపైకే మూకదాడికి దిగారు కొందరు దుండగులు.
వివరాల్లోకి వెళితే.. వెస్ట్ బెంగాల్లోని హౌరా ప్రాంతం ప్రస్తుతం రెడ్ జోన్లో ఉంది. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో.. ప్రభుత్వం దీన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. అయితే మంగళవారం తికియాపారా ప్రాంతంలో కొందరు రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. గుంపులు గుంపులుగా ఉండొద్దని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే వారు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా.. రోడ్లపై అలానే ఉన్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తుండగా.. పోలీసులకు, స్థానికులకు మధ్య కాస్త వాగ్వాదం చోటుచేసుకుంది.దీంతో ఒక్కసారిగా వందలమంది గుమికూడి.. పోలీసులపై వారి వాహనాలపై మూకదాడికి దిగారు. స్థానికులు రాళ్లతో దాడి చేస్తుంటే.. పోలీసులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యారు.
ప్రస్తుతం స్పెషల్ ఫోర్స్ను దింపి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. అయితే స్థానికులు పోలీసులపై దాడి చేస్తున్న వీడియోను కొందరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇది వైరల్గా మారింది. ఇప్పటికే పలుమార్లు వెస్ట్ బెంగాల్ గవర్నర్ మమతా సర్కార్ లాక్డౌన్ కొనసాగించడలో విఫలమయ్యారని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలను తెప్పించుకుని పటిష్టంగా లాక్డౌన్ పాటించాలంటూ సూచించారు కూడా.
#WATCH: A crowd, which had gathered at a market place in Tikiapara of Howrah today – defying the lockdown, attacked Police personnel & pelted stones at them when they asked the crowd to return to their homes. 2 police personnel injured. #WestBengal (Video source: Amateur video) pic.twitter.com/EAZbm5wWlc
— ANI (@ANI) April 28, 2020