వ్యాక్సిన్‌లపై మోదీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. ఇకపై రాష్ట్రాలకు..

Spread the love

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మోదీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కేవలం 45 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఇస్తుండగా.. ఇక మే 1వ తేదీ నుంచి మూడో దశ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్రం పేర్కొంది. ఈ దశలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తుండటంతో.. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలకు కూడా పలు వెసులుబాటును కల్పించింది.

ఇకపై వ్యాక్సిన్‌ తయారీదారులు 50శాతం వ్యాక్సిన్‌లను కేంద్ర ప్రభుత్వానికి.. మరో 50 శాతం వ్యాక్సిన్‌లను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఓపెన్‌ మార్కెట్‌కు కూడా సరఫరా చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో తయారీ దారులకు కాస్త వెసులుబాటు ఇచ్చినట్లైంది. అయితే కేంద్ర నిల్వాలు తమ వద్ద అయిపోయాయంటూ పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ సోమవారం వరుస భేటీలు నిర్వహించారు. వైద్యులు, ఫార్మా సంస్థలతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు.

వ్యాక్సిన్‌ తయారీ వేగవంతం.. రూ.4500 కోట్ల కేటాయింపు..

ఇక వ్యాక్సిన్‌ తయారీ వేగవంతం చేసేందుకు సిరమ్‌,భారత్‌ బయోటెక్‌ కంపెనీలకు నిధులను సమీకరించేందుకు రెడీ అయ్యింది. వ్యాక్సిన్ తయారీ ఉత్ప‌త్తిని పెంచ‌డానికి సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భార‌త్ బ‌యోటెక్‌ కంపెనీల‌కు రూ.4500 కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణ‌యంచింది. దీనికి సంబంధించిన ఆర్ధిక శాఖ సోమవారం నాడు సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెల్పినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.3000 కోట్ల‌ను సీర‌మ్‌ సంస్థకు, రూ.1500 కోట్ల‌ను భార‌త్ బ‌యోటెక్‌ సంస్థకు ఇవ్వ‌నుంది.


Spread the love
error: Content is protected !!