పేటీఎం వినియోగదారులకు భారీ ఊరట.. కానీ అలా చేస్తే మాత్రం ఛార్జీలు తప్పవట..!

Spread the love

పేటీఎం కస్టమర్లకు ఆ సంస్థ ఫౌండర్‌ ఓ గుడ్‌న్యూస్ ప్రకటించారు. ఇప్పటి వరకు పేటీఎం వ్యాలెట్‌లో ఉన్న డబ్బులను వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే ఛార్జీలను వసూలు చేసేది. అయితే ఇక నుంచి వినియోగదారుడికి చెందిన వ్యాలెట్‌ మనీని.. వారి బ్యాంక్‌ అకౌంట్‌కు నేరుగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చని.. ఇందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని సంస్థ ఫౌండర్‌ విజయ్ శేఖర్ శర్మ తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ద్వారా తెలిపారు.

పేటీఎం వినియోగదారుడు ఒకరు.. ఈ ఛార్జీల విషయంపై ప్రశ్నించడంతో.. అందుకు సమాధానంగా ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం వాలెట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే మాత్రం.. 2శాతం ఛార్జీలను వసూలు చేయనుంది.


Spread the love
error: Content is protected !!