On eve of Diwali..వావ్‌.. దేశ ప్రజలకు మోదీ సర్కార్‌ దీపావళి భారీ గిఫ్ట్‌.. పెట్రోల్‌, డీజిల్‌పై భారీ తగ్గింపు..!

Spread the love

దేశ ప్రజలంతా పెను భారంగా భావిస్తున్న పెట్రో ధరలపై మోదీ సర్కార్‌ తీపి కబురు పంపింది. సామాన్య ప్రజల ఇబ్బందులను అర్ధం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ధరలకు బ్రేకులు వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని పెట్రోల్‌,డీజిల్‌పై విధిస్తున్న ఎక్సైస్‌ డ్యూటీని భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీపావళి పండుగ రోజు నుంచి పెట్రోల్‌పై రూ.5/-, డీజీల్‌పై రూ.10/-ల ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించనున్నట్లు సమాచారం. దీంతో సెంచరీ దాటి పరుగులు పెడుతున్న పెట్రో ధరలకు కాస్త బ్రేకులు పడనున్నాయి.


Spread the love
error: Content is protected !!