ఎన్నారైలకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ట్రంప్..ఇక నుంచి వారందరికీ..!

Spread the love

అమెరికా ఫస్ట్.. అదర్స్ నెక్స్ట్‌.. ఇది డోనాల్డ్ ట్రంప్‌ నినాదం. తొలుత నావాళ్లు.. ఆ తర్వాతే పక్కింటి వాళ్లు.. అంటుంటారు అగ్ర రాజ్య అధినేత డోనాల్డ్‌ ట్రంప్. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కూడా అదే సూత్రాన్ని పాటిస్తున్నారు ట్రంప్.ఈ ట్రంప్‌ ఫార్ములా ఇప్పుడు అమెరికాలో సెటిల్‌ కావాలనుకుంటున్న ఇండియన్స్‌, ఎన్నారైలకు ఇది చేధు వార్తగా మిగిలింది. కరోనా మహమ్మారి ప్రభావంతో.. అమెరికాలో చాలా మంది స్థానికులకు ఉద్యోగాలు పోతున్నాయన్నారు. దీంతో ఇక ఇమ్మిగ్రేషన్ విధానంలో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై తన అధికారిక ట్విట్టర్ నుంచి ఓ ట్వీట్‌ కూడా చేశారు. ఇందుకు సంబంధించి పరిపాలనా పరమైన ఆదేశంపై సంతకం కూడా చేస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆయన పెట్టిన ట్వీట్‌ సింపుల్‌గా ఉన్నా.. అందులో ఉన్న మెసేజ్ మాత్రం చాలా పెద్దదని తెలుస్తోంది. అది ఎన్నారైలకు షాకింగ్‌ న్యూస్‌ అనే చెప్పవచ్చు. ఎవరైతే యూఎస్‌లో స్థిరపడాలనుకుంటున్నారో.. వారందరికీ ట్రంప్‌ ట్వీట్‌ బ్రేకులు వేసినట్లు అర్ధమవుతోంది. ఆయన పెట్టిన ట్వీట్‌ సారంశం ఏంటంటే.. ” ప్రస్తుతం మనపై కనిపించని శత్రువు దాడి చేస్తోంది. దాన్ని కరోనా వైరస్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు గ్రేట్ అమెరికన్ పౌరుల ఉద్యోగాల్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అంటూ తన ట్వీట్‌లో బుల్లెట్‌ పాయింట్లు సంధించారు. ఈ సింగిల్‌ లైన్‌ ట్వీట్‌ సంచనలంగా మారింది.

వైట్ హౌస్ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. కరోనా మహమ్మారి కథ ముగిసిందనీ.. దేశం మళ్లీ ప్రారంభం అవుతుందని తెలిపింది. మే మధ్య వరకూ కెనడా, మెక్సికో సరిహద్దుల నుంచి అత్యవసరం కాని రవాణాపై ఆంక్షలు కొనసాగించాలని అమెరికా ఆ రెండు దేశాలతో డీల్ కుదుర్చుకుంది.


Spread the love
error: Content is protected !!