దుబ్బాక బైపోల్ సమరం ముగిసింది. సాయంత్రం 6.00 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరిగింది. కరోనా సోకిన వ్యక్తులకు ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు. దాదాపు 80 శాతానికి పైగా ఓటింగ్ జరగడంతో.. గెలుపు ఎవర్ని వరిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు ముగిసిన సమయంలో.. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో దుబ్బాకలో కాషాయ జెండా రెపరెపలాడనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత ద్వితీయ స్థానంలో టీఆర్ఎస్ ఉండగా.. ఆ తర్వాత హస్తం పార్టీ ఉండనున్నట్లు పేర్కొంది.
పొలిటికల్ ల్యాబరేటరీ సంస్థ వివరాల ప్రకారం..
బీజేపీ – 47 శాతం ఓట్లు
టీఆర్ఎస్ – 30 శాతం
కాంగ్రెస్ – 13 శాతం
ఇక మరో సంస్థ వెల్లడించిన సర్వే రిపోర్టుల ప్రకారం.. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని వెల్లడించింది. కాగా, ఎన్నికలు ముగిసిన తర్వాత.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్మీట్ నిర్వహించారు. దుబ్బాకలో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు.