దుబ్బాక ఉపఎన్నికల పోటీ మరింత వేడెక్కింది.ఇప్పటికీ అధికార TRS పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు అభ్యర్థిని ఫైనల్ చేసింది. అయితే రాష్ట్రంలో అధికార TRS పార్టీ కి ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీ అభ్యర్థిని ఫైనల్ చేసింది. క్షేత్ర స్థాయిలో ఎక్కువ మంది కార్యకర్తలు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు వైపే మొగ్గుచూపారు. అటు రాష్ట్ర నాయకులు కూడా రఘునందన్ వైపే మొగ్గు చూపారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి దేశ వ్యాప్తంగా జరుగుతున్న బై పోల్ ఎన్నికల అభ్యర్థుల లిస్ట్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం లో జరిగే దుబ్బాక ఉపఎన్నికకు రఘునందన్ రావు పేరును ఖరారు చేసింది. dubbaka bypoll bjp candidate name announced