లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అడవుల్లో ఉండే జంతువులన్నీ యథేచ్చగా గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామంలోని పురాతన భవనంలో పులి నివాసాన్ని ఏర్పరుచుకుంది. అందులో తన పిల్లలతో గడిపేస్తోంది. ఇక తాజాగా కేరళలో గజరాజు హాయిగా ఓ గ్రామంలోకి ప్రవేశించింది. మున్నూర్ ప్రాంతంలోని ఇడుక్కీ రోడ్లపై షికార్లు కొడుతోంది. దీనికి సబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీధుల్లో షికార్లు చేస్తుండాటాన్ని చూసిన గ్రామాస్థులు అధికారులకు సమాచారం అందించారు. ఆ గజరాజును పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆహారం కోసమే గ్రామాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలంతా ఇంటికి పరిమితమైతే.. అడవుల్లో ఉండే జంతువులన్నీ యథేచ్చగా గ్రామాలను సందర్శిస్తున్నాయి.
Kerala: An elephant walks on the empty streets in Munnar amid the #CoronavirusLockdown. (24.04.2020) pic.twitter.com/QZbr7kjzu9
— ANI (@ANI) April 24, 2020