పాక్‌ లాంచింగ్‌ ప్యాడ్స్‌ను స్మాష్ చేసిన ఇండియన్‌ ఆర్మీ.. ఇదిగో వీడియో‌..

Spread the love

పాకిస్థాన్‌కు మరోసారి మన దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది భారత సైన్యం. ఓ వైపు కరోనాతో ప్రపంచమంతా పోరాడుతుంటే.. జిత్తులమారి వేశాలు వేస్తూ.. మనదేశంలోకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది. బార్డర్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. అదేసమయంలో ఉగ్రవాదులను దేశంలోకి పంపించే ప్రయత్నాలు చేస్తోంది. పాక్ ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు భారత సైన్యం చెక్ పెడుతోంది. సరిహద్దులు దాటుదామనుకుంటున్న ఉగ్రవాదులను అక్కడనే మట్టుబెట్టేస్తోంది. తాజాగా.. బార్డర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో భారత సైన్యం కూడా పలువురు జవాన్లను కోల్పోయింది. అంతేకాదు.. తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పుడుతోంది. దీంతో భారతసైన్యం పాకిస్థాన్‌కు తమ సత్తా ఎంటో రుచిచూపించింది.

తాజాగా శుక్రవారం రోజున.. కుప్వారాలోని కేరన్ సెక్టార్‌ మీదుగా మరోసారి కాల్పులకు దిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు.. పాకిస్థాన్‌కు ధీటుగా సమాదానం చెప్పింది. సరిహద్దుల్లో ఉన్న టెర్రర్ లాంచ్‌ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని భారతసైన్యం దాడులకు దిగింది. అంతేకాదు.. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఓ లాంచ్ ప్యాడ్‌ను టార్గెట్ చేసి కూడా దాడి చేశారు. భారత సైన్యం జరిపిన దాడుల్లో లాంచింగ్‌ ప్యాడ్లను నేలమట్టమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పాకిస్థాన్‌కు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా సైన్యం విడుదల చేసింది.


Spread the love
error: Content is protected !!