మహాత్మా గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అహింసా మార్గంలో భారత స్వాతంత్ర్యానికి బాటలు వేశారు. యావత్ ప్రంపంచానికి అహింస మార్గాన్ని ఉపదేశించారు. మనుషులంతా ఒక్కటేనంటూ.. ఆఫ్రికా ఖండం నుంచి అమెరికా వరకు చాటిచెప్పారు. అందుకే ఆ మహనీయుడికి విదేశాల్లో కూడా విగ్రహాలు ఉన్నాయి. అలాంటి మహనీయుడు జన్మదినం అక్టోబర్ 2వ తేదీని..అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తున్నారు. అయితే ఆయన జీవితం నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలంటే.. నిజ జీవితంలో ఎలా గడపాలి..? మన ఖర్చులు ఏ విధంగా ఉండాలి..? సహనం, ఓర్పు ఎక్కడ ప్రదర్శించాలన్న వాటి గురించి మనమంతా నేర్చుకోవచ్చు. ఆయన మార్గంలో అనుసరిస్తే.. ప్రతి కుటుంబం పేదరికాన్ని జయించడమే కాకుండా.. ఇతరులకు ఆదర్శంగా కూడా ఉండవచ్చు. ముఖ్యంగా అయిదు అంశాలు (ఆర్ధిక సూత్రాలు) గురించి చూస్తే..
అధికంగా ఖర్చు చెయ్యడం తగ్గించండి
నిత్యం మనం చేసే ఖర్చుల అంశం మన చేతిలోనే ఉంటుంది. దీనిని తగ్గించుకోవడం అన్నది మన చేతిలో ఉన్న పనే. మనం తినే ఆహారం, మందులు, పిల్లల చదువులకు సంబంధించిన ఖర్చులు తప్పనిసరి. కానీ కొన్ని అనవసరమైనవి కూడా ఉంటాయి. ఇక్కడ మనం కొంచెం ఖర్చు తగ్గించుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఇంకా కొన్ని విలాసాలకు సంబంధించిన వాటిలో అనవసరమైన ఖర్చులు ఉంటాయి. వీటిలో ఎక్కడెక్కడ ఖర్చులను కంట్రోల్ చేసుకోవాలన్నది మీపైనే ఆధారపడి ఉంటుంది. గాంధీజీ తన ఆత్మకథ “MY EXPERIMENTS WITH TRUTH”లో తాను చేసిన ప్రతి ఖర్చును ఎలా లెక్కగట్టారో పేర్కొన్నారు.
పెట్టుబడులు పెట్టేప్పుడు దురాశకు పోకూడదు
మహాత్ముడి సూక్తి ప్రకారం.. “ఈ ప్రపంచం అందరి అవసరాలకు సరిపోతుంది.. కానీ దురాశ వాహులకు కాదు..” ఇది మన జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది తెలుపుతుంది. మన నిత్యవసరాల్లో కొన్నింటిపై పెట్టే పెట్టుబడుల విషయంలో కాస్త చూస్తూ పెట్టాలి. మనకు అవసరమైన దాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి. అనవరసమైనవి కూడా కొనడం ద్వారా ఖర్చు పెరుగుతుంది. ఇక్కడ కాస్త కంట్రోల్లో ఖర్చు చేస్తే.. అనవసర ఖర్చును తగ్గించుకోవచ్చు.
వెంటనే అద్బుతాలు జరుగుతాయనుకోవద్దు.. చిన్న చిన్న అడుగులేయండి
చాలా మంది ప్రజలు.. ఏదైనా ప్రారంభిస్తే.. పెద్ద ఎత్తున ఊహలు ఊహించుకుంటారు. ప్రారంభంలోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని భావిస్తుంటారు. అయితే చిన్నచిన్న అడుగులు వేయడం ద్వారానే.. ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని గాంధీ గారి సూక్తుల ద్వారా అర్ధమవుతుంది. ఏ ఇళ్లైనా.. ఒక్కో ఇటుక పేర్చితేనే.. భవనం అవుతుంది. చిన్నచిన్న పెట్టుబడులు పెడుతుంటే.. అవే భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారుతాయని.. అప్పుడు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందని గాంధీ సూక్తుల ద్వారా తెలుస్తోంది. గాంధీ తన స్వాతంత్ర్య పోరాటంలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారని తెలుసు.. కానీ ప్రారంభంలో పదుల సంఖ్యలోనే పాల్గొన్నది గుర్తుంచుకోవాలి.
ఆర్ధిక క్రమశిక్షణ.. ఇదే అతి ముఖ్యం.. పాటించాల్సిందే
మహాత్మా గాంధీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. గాంధీజీ, క్రమశిక్షణ అనేవి పర్యాయపదాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు.అతని జీవిత చరిత్ర గమనిస్తే.. ఆయన క్రమశిక్షణను ఎలా కొనసాగించాడన్నది. సత్యం పలుకుతూ.. క్రమశిక్షణకు కట్టుబడి.. జీవితంలో ఎన్నో మహోన్నత శిఖరాలను గాంధీజీ అధిరోహించారు. ఆయన జీవితన్ని గమనిస్తూ.. ఆర్ధిక క్రమశిక్షణ నేర్చుకోవడమే కాకుండా.. పాటించడం అలవాటు చేసుకోవాలి. వంద రూపాయలను పొదుపు చేయడం నేర్చుకోవడంతో దీనిని ప్రారంభించాలని తెలుస్తుంది. జీవితంలో దానిని క్రమక్రమంగా పెంచుకుంటూ పోవాలని.. పొదుపు చేయడానికి గరిష్ట పరిమితులు లేవంటారు.
సహనంతో కూడిన విశ్వాసం
స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఎప్పుడు కూడా ఆయన సహనాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగారు. ఇక ఈ సహనం, విశ్వాసం అన్నవి ఆర్ధిక అంశాల్లో కూడా చాలా పోలిక ఉంటుంది. రాత్రికి రాత్రే.. కోటీశ్వరులు అవ్వాలని అనుకోవద్దు. దేనికైనా కాస్త సమయం ఇస్తూ.. సహనంతో ఉండాలని గాంధీ సూక్తుల ద్వారా అర్ధమవుతుంది. దీర్ఘకాలికంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్లు మంచి లాభాలను ఇస్తాయని.. దీని కోసం మనం చేయాల్సిందల్లా.. సరైన సమయం కోసం సహనంతో ఉండటమేనని గాంధీజీ సూక్తుల ద్వారా తెలుస్తుంది.
ఫైనల్గా మనం నిత్యం పెట్టే వృథా ఖర్చులను తగ్గించుకుంటూ.. అత్యాశకు పోకుండా ఉండటం ద్వారా.. ఖర్చులు తగ్గుతాయని తెలుస్తుంది. ప్రస్తుత కరోనా కాలంలో గాంధీజీ ఆర్ధిక సూత్రాలను పాటిస్తే.. కష్టాలను సులువుగా జయించవచ్చు. ఈ సమయంలో అత్యాశకు పోకుండా.. జాగ్రత్తగా ఉండటం ద్వారా.. మోసకారుల చేతిలో పడకుండా ఉండవచ్చు.