యూపీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం బాగ్పత్ జిల్లాకు చెందిన కీలక నేతను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. మృతుడు బాగ్పత్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు సంజయ్ ఖోఖర్గా గుర్తించారు. మంగళవారం ఉదయం.. ఒంటరిగా నడుచుకుంటూ తన పొలానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. బాగ్పత్లోని ఛప్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.
సంజయ్ ఖోఖర్ హత్యతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.