సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్కు బిగ్ షాకిచ్చారు. ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎలాంటి శాఖ లేకుండా కేవలం మంత్రిగా ఉండిపోయిన ఈటలను.. మంత్రి వర్గం నుంచి తొలిగించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని గవర్నర్ కార్యాలయం పేర్కొంది.
కాగా, భూకబ్జాలు చేసినట్లు ఆరోపణలు రావడం.. రైతుల చేసిన ఆరోపణలు, కలెక్టర్ నివేదికను పరిగణలోకి తీసుకుని ఈటల రాజేందర్ను శనివారం నాడు మంత్రి వర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.