మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తొలుత కరోనాబారినపడ్డ ఆయన.. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. కోమాలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తన ట్విట్టర్లో వెల్లడించారు.