ప్రజల క్షేమమే లక్ష్యంగా.. సీఎం కేసీఆర్‌ తీపి కబురు..

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కసరత్తులు ప్రారంభించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజలందరికీ ఓ తీపి కబురును అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ ప్రక్రియకు దాదాపు రూ.2500 కోట్లు ఖర్చు అవుతుందని.. అయితే ప్రజల ప్రాణాలకంటే డబ్బు ముఖ్యం కాదని పేర్కొంటూ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంబంధించిన ఆదేశాలను సీఎస్‌, వైద్యశాఖ అధికారులకు ఇచ్చినట్లు సీఎం తెలిపారు.

కాగా, ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ వాక్సిన్స్ తయారీ చేస్తుందని, రెడ్డీ ల్యాబ్స్‌తో సహా మరికొన్ని సంస్థలు వ్యాక్సిన్‌ రెడీ చేసేందుకు ముందుకు వచ్చాయని.. కాబట్టి ఈ వ్యాక్సినేషన్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని సీఎం స్పష్టం చేశారు. అంతేకాదు.. ప్రజలు ఏ విధమైన భయబ్రాంతులకు గురికావద్దంటూ సీఎం సూచించారు. కరోన బారిన వారికోసం పడకల విషయంలోనూ.. మెడిసిన్స్‌ విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సిందంతే చేస్తుందన్నారు. ప్రజలను కరోనా బారినుంచి కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. పెద్ద ఎత్తున సానిటైజేషన్‌ చేపడుతుందని సీఎం ప్రజలకు భరోసా ఇచ్చారు.

స్వయం క్రమశిక్షణ పాటించాలి

ప్రజలంతా స్వయం క్రమశిక్షణ పాటించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఒకే చోట గుమికూడవద్దని.. ఊరేగింపుల్లో పాల్గొనవద్దని.. అత్యవసరమైతే తప్ప.. బయట తిరగవద్దంటూ సీఎం కేసీఆర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రజా క్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

 


Spread the love
error: Content is protected !!