వాహనదారులకు గుడ్ న్యూస్.. మొన్నటివరకు పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు… కరోనా ఎఫెక్ట్ తో రష్యా సౌదీ ల మధ్య జరుగుతున్న ధరల యుద్ధంతో క్రూడ్ ఆయిల్ రేట్లు ఫిబ్రవరి 2016 నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. పెట్రోల్ లీటరుకు రూ. 2.69 రూపాయలు, డీజిల్ లీటరుకు రూ. 2.33 తగ్గాయి. ఢిల్లీలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ .70.29, డీజిల్ లీటరు ధర 63.01 రూపాయలుగా ఉంది. అటు ముంబై,బెంగళూరు,చెన్నై,హైదరాబాద్ లో కూడా పెట్రొల్ ధరలు తగ్గు ముఖం పట్టాయి.