భాగ్యనగర్లోని వినాయక్ సాగర్ను గురువారం నాడు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్దళ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధికారులు సందర్శించారు. ట్యాంక్బండ్పై నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్ధం, నిమజ్జనానికి వచ్చేసే వారికి మెరుగైన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయాలని ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీ అధికారులను డిమాండ్ చేశారు.
పోలీసు అధికారులతో నిమజ్జనాల ఏర్పాట్ల విషయంలో ఏర్పాటు చేసిన భద్రతా పరమైన విషయాల గురించి చర్చించారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, కో కన్వీనర్ కుమార స్వామి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు ఆలె భాస్కర్, ఆలె జితేందర్ పలువురు నేతలు పాల్గొన్నారు.
ట్యాంక్బండ్ వద్ద ఏర్పాట్ల పరిశీలన అనంతరం.. కూకట్ పల్లి, సఫిల్గూడ లేక్, సరూర్నగర్ లేక్లను ఉత్సవ కమిటీ సభ్యులు, వీహెచ్పీ, బజరంగ్ దళ్ నేతలు పరిశీలించారు.