బిగ్‌ బ్రేకింగ్‌.. గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌లో హతం

Spread the love

మోస్ట్ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబేను యూపీ స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ నుంచి కాన్పూర్‌ తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కాన్పూర్‌ సమీపంలో వికాస్‌ దూబేను తరలిస్తున్న కాన్వాయ్‌లో ఓ కారు బోల్తా పడిందిన. ఈ క్రమంలో అందులో ఉన్న కానిస్టేబుల్స్
గాయపడ్డారు. అయితే అదే కాన్వాయ్‌లో ఉన్న వికాస్ దూబే.. కానిస్టేబుల్ వద్ద ఉన్న పిస్టల్‌ తీసుకుని పారిపోబోయాడు. ఈ క్రమంలో లొంగిపొమ్మని హెచ్చరించినప్పటికీ.. పారిపోతుండటంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వికాస్‌ దూబే అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయాన్ని కాన్పూర్ పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

 

 


Spread the love
error: Content is protected !!