గ్లెన్‌మార్క్‌ నుంచి మరో గుడ్‌న్యూస్‌.. ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ ధర తగ్గింపు..

Spread the love

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ దేశాలను ఎంతలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో పాటు.. సరైన మెడిసిన్‌ కూడా అందుబాటులో లేదు. ఒక్కో దేశం ఒక్క విధానంలో చికిత్స అందిస్తూ.. కరోనా బారినపడిన రోగులకు చికిత్స అందిస్తోంది. ఈ క్రమంలో మన దేశంలో తొలుత హైడ్రాక్సిక్లోరోక్వీన్‌ ట్యాబ్లెట్లను వాడగా.. ఆ తర్వాత ఇతర మెడిసిన్స్‌ను కూడా వాడుతున్నారు. ఇక గత కొద్దిరోజులుగా కరోనా లక్షణాలు ఉన్న వారు.. ప్రాథమిక స్థాయిలో గ్లెన్‌మార్క్ అభివృద్ధి చేసిన ఫావిపిరవిర్ ట్యాబ్లెట్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే దాదాపు పద్నాలుగు రోజులపాటు ఈ మెడిసిన్‌ను  (వైద్యుల సూచనల మేరకు మాత్రమే)వాడాల్సి ఉంటుంది. దీని ధర ప్రారంభ సమయంలో (గత జూన్ నెలలో) రూ.103 (ఒక్కో ట్యాబ్లెట్‌ ధర)గా ఉంది. అయితే పద్నాలుగు రోజులపాటు వాడాల్సి ఉండటంతో సామాన్య ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి ఉండేది. అయితే ఈ క్రమంలో దీని ఉత్పత్తిని పెంచడంపై గ్లెన్‌మార్క్‌ సంస్థ దృష్టిపెట్టింది. దీంతో ఈ ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ల ధరను సామాన్యులను అందుబాటు ధరలో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈ మెడిసిన్‌పై 27 శాతం ధరను తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దీంతో ఇక ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ ఇక నుంచి రూ.75/- కే అందుబాటులో రానుంది. ఈ విషయాన్ని జాతీయ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఫాబిప్రూ పేరుతో ఫావిపిరవిర్ అనే యాంటీ-వైరల్ drug ధరను తగ్గించినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ సోమవారం తెలిపింది.


Spread the love
error: Content is protected !!