దేశ వ్యాప్తంగా కన్నుల పండుగగా గోపాష్టమి వేడుకలు.. నగరంలో పాల్గొన్న వీహెచ్పీ అధికారులు..

Spread the love

భారతీయ సంస్కృతి అనేది.. గో సంస్కృతి స్వరూపము. మనం జరుపుకునే పండుగలలో అనేక చోట్ల గోవులను స్మరించుకుంటాము. గోమాతగా పూజిస్తూ.. గోవుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తాము. ఇటువంటి గోమాతలకు సంరక్షకుడిగా శ్రీకృష్ణ రమాత్ముడు ఉంటాడన్నది జగమెరిగిన సత్యం. అయితే తొలిసారిగా శ్రీకృష్ణుడు గోవులను సంరక్షించేందుకు వెళ్లిన రోజు గోపాష్టమి.. ఆ రోజున ప్రతిఏటా గోపాష్టమి పండుగగా జరుపుకోవడం అనాధిగా వస్తున్న ఆచారం. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా దేశ వ్యాప్తంగా గోపాష్టమి వేడుకలు మిన్నంటాయి.

నగరంలోని వనస్థలిపురంలో గోపాష్టమి సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించారు. అంతేకాదు.. అక్కడ ఉన్న గోమాతలకు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. ఈ వేడుకల్లో విశ్వహిందూ పరిషత్‌ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి స్థానుమలయన్‌ జీ, తెలంగాణ ప్రాంత సంఘటనా మంత్రి ముడుపు యాదిరెడ్డి, మహానగర్‌ అధ్యక్షుడు కోడె శ్రీనివాస్‌ రాజా, భాగ్యలక్ష్మి విభాగ్‌ కార్యదర్శి వీరేశలింగం, క్షేత్ర గోసేవా ప్రముఖ్‌ శ్రీ యాదగిరి రావు, సతీష్‌ పాల్గొన్నారు.

వనస్థలిపురంలో గోపాష్టమి సందర్భంగా హోమం
వనస్థలిపురంలో గోపాష్టమి సందర్భంగా హోమం
వనస్థలిపురంలో గోపాష్టమి వేడుకల్లో వీహెచ్పీ నేతలు..

ఇక మల్కాజ్‌ గిరి జిల్లా కాప్రా మండలం జవహర్‌ నగర్‌ కాలనీలోని ఛత్రపతి గోశాలలో.. అలాగే మల్కాజ్‌గిరి ఈస్ట్‌ ఆనంద్‌ భాగ్‌లోని జైన్‌ గోశాలలో కూడా విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా కార్యదర్శి రజినీకాంత్‌, జిల్లా మాతృశక్తి సంయోజిక పశ్యంతి, ఛత్రపతి గోశాల నిర్వాహకులు శివ.. స్థానిక మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. గోమాతలకు హారతి ఇచ్చి.. గోగ్రాసంగా అరటిపండ్లు తినిపించడం జరిగింది.

గోపాష్టమి సందర్భంగా బాలాజీనగర్ ఛత్రపతి గోశాలలో..
గోపాష్టమి సందర్భంగా బాలాజీనగర్ ఛత్రపతి గోశాలలో..
ఈస్ట్ ఆనంద్ భాగ్ జైన్ గోషాలలో..
కరీనగర్ విభాగ్ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో.. గోపాష్టమి వేడుకలు..

సికింద్రాబాద్, కోఠి ప్రాంతాల్లోని గౌలిగూడ, నారాయణ గూడా, చిక్కడపల్లి ప్రాంతాల్లో విద్యానగర్ జిల్లా కార్యదర్శి అజయ్ రాజ్, తెలంగాణ ప్రాంత బజరంగ్ దళ్ కో కన్వీనర్ శివరాములు గోమాతలకు పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు, దుర్గా వాహినికి చెందిన యువతులు, స్త్రీలు గోమాతలకు పూజలు నిర్వహించారు.

గోపాష్టమి సందర్బంగా విద్యానగర్ జిల్లాలో…అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు జరిగాయి. అంతేకాదు.. భాగ్యనగరంలోని అనేక గోశాలల్లో గురువారం కూడా గోపాష్టమి వేడుకలు నిర్వహించారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా ఇమ్లీబన్‌ గోషాలలో గోపూజ నిర్వహించారు.


Spread the love
error: Content is protected !!