పతంజలి సంస్థకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ భారీ షాక్ ఇచ్చింది. పతంజలి విడుదల చేసిన కరోనా కిట్కు బ్రేకులు వేసింది. కోరోనిల్ మరియు స్వరసీ పేరుతో రిలీజ్ చేసిన మెడిసిన్ కరోనా వైరస్ను కట్టడి చేస్తుందంటూ యోగా గురువు రాందేవ్ బాబా మంగళవారం మధ్యాహ్నం హరిద్వార్లో లాంచ్ చేశారు. ఈ మెడిసిన్ ద్వారా 4 నుంచి 7 రోజుల్లో కరోనా సోకిన పేషంట్లను నయం చేయవచ్చని రాందేవ్ ప్రకటించారు. అంతేకాదు.. తాము 280 మందిపై దీనిని ప్రయోగించినట్లు కూడా తెలిపారు. వీరిలో 4 రోజుల్లో 63శాతం మంది కోలుకోగా.. మిగతా వారు 7 నుంచి 9 రోజుల్లో కోలుకున్నట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వార్తలు పలు జాతీయ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అలర్ట్ అయ్యింది. దీనిపై పతంజలిని వివరణ కోరింది. పతంజలి సంస్థ చెప్పే కోరోనిల్ మెడిసిన్ శాస్త్రీయత నిర్ధారించాల్సిన అవసరం ఉందని.. కరోనా కట్టడికి సంబంధించిన దాని గురించి నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఓ ప్రకటనలో వెలువరించింది. అంతేకాదు.. అప్పటి వరకు ఈ మెడిసిన్ గురించి ప్రచారాన్ని నిలిపివేయాలని.. పబ్లిషింగ్ కూడా ఆపేయాలంటూ ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థను ఆదేశించింది.
Ministry has taken cognizance of news in media about Ayurvedic medicines developed for #COVID19 treatment by Patanjali Ayurved Ltd. The company asked to provide details of medicines & to stop advertising/publicising such claims till the issue is duly examined: Ministry of AYUSH pic.twitter.com/OBpQlWAspu
— ANI (@ANI) June 23, 2020