చెన్నై సూపర్ కింగ్స్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే టీం స్టార్ బ్యాట్స్మెన్ కం స్పిన్నర్ సురేశ్ రైనా ఈ సీజన్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే రైనా బాటలో మరో ప్లేయర్ కూడా తప్పుకోనున్నాడు. ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల నుంచి తప్పుకోబోతున్నట్లు తన అధికారిక ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ విషయాన్ని టీం మేనేజ్మెంట్కు కూడా తెలిపినట్లు తెలుస్తోంది. అయితే హర్జజన్ దీనిపై స్పందించినప్పటికీ.. అధికారికంగా ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ స్పందించలేదు.
“డియర్ ఫ్రెండ్స్, నేను ఈ సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్లు ఆడటం లేదు. నాకు ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల ఆడటం లేదు. ఇప్పుడు ఉన్న క్లిష్టపరిస్థితుల్లో కాస్త దూరంగా ఉండి.. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఎంతో సపోర్ట్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సురక్షితంగా జరగాలని కోరుకుంటున్నాను. జై హింద్.” అంటూ హర్బజన్ సింగ్ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు.