కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ..
కమలం గూటికి హార్దిక్ పటేల్..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేత హార్దిక్ పటేల్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడు రాష్ట్రంలో బలమైన సామజిక వర్గంగా ఉన్న పటేల్ సామాజిక వర్గంకు చెందినవారు. గతంలో పటేల్ ఉద్యమాన్ని నడిపిన తీరుతో రాష్ట్రంలో బీజేపీకి కొంచెం ఇబ్బందిగా మారింది. అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. హార్దిక్ పటేల్ కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. జూన్ 2వ తేదీన బీజేపీలో చేరనున్నట్లు జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది.
https://twitter.com/ANI/status/1531511436023074816?t=vxE31mq3-Jq2Nhps6luf0g& lo