రైతుల కోసం.. శానిటైజర్‌ తాగి బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం..!

Spread the love

ఒడిషాలో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మల్యే సుభాష్‌ పణిగ్రహి శానిటైజర్ సేవించి సూసైడ్‌కు యత్నించారు. దియోఘర్‌ రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని.. ఇక్కడి రైతుల ధాన్యాన్ని సేకరించడం లేదని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారని.. వెంటనే ప్రభుత్వం వరి ధాన్యం సేకరణ జరిపంచాలని చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని.. అందుకే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు
ఎమ్మెల్యే తెలిపారు. దియోఘర్‌ ప్రాంతంలో 2లక్షల క్వింటాళ్లకు పైగా వరి ధాన్యం అమ్ముడు పోలేదని సదరు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని సేకరించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


Spread the love
error: Content is protected !!