కత్తులతో హిందూ కుటుంబాలకు బెదిరింపు.. స్థానికులంతా కలిసి..

Spread the love

బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా జీవనం సాగిస్తున్న హిందువులపై అక్కడి జిహాదీ మూకల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హిందూ కుటుంబాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతూ.. హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. అంతేకాదు.. ఇటీవల ఇంకో అడుగు ముందకు వేసి.. పాక్‌ తరహాలో హిందువులను టార్గెట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న హిందువులను మతం మారాలంటూ ఇస్లామిక్ జిహాదీ మూకలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. మతం మారుతారా..? లేదా దేశం విడిచి పోతారా..? అంటూ బెదిరింపు లేఖలు అంటిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

అయితే ఈ బెదిరింపులకు విసిగిపోయారో.. లేదా.. బతకడమో.. చావడమో అని తెగించారో తెలీదు కానీ.. తంగిల్‌ ప్రాంతంలోని మీర్జాపూర్‌లో హిందూ కుటుంబాలను కత్తులతో బెదిరింపులకు దిగిన ఓ వ్యక్తిని చితకబాదారు. స్థానికుల సహాయంతో చితక్కొట్టి.. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మీర్ షహీదుర్‌ రహ్మాన్‌గా గుర్తించారు. స్థానిక హిందూ కుటుంబాల వద్దకు కత్తులతో వెళ్లి.. బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో స్థానికులంతా కలిసి.. అతడిని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన విషయాన్ని బంగ్లాదేశ్‌కు చెందిన హిందూ యాక్టివిస్ట్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు.


Spread the love
error: Content is protected !!