పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. తండో మహమ్మద్ ఖాన్ అనే ప్రాంతంలో ఓ హిందూ కుటుంబం సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు పేదరికమే కారణమని తెలుస్తోంది. వారి పిల్లలకు కనీసం తిండి పెట్టలేని పరిస్థితులు రావడంతో గత్యంతరం లేక ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుస్తోంది. పాకిస్తాన్కు చెందిన హిందూ సంఘాల సోషల్ మీడియాలో ఈ ఘటనకు చెందిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
కాగా, ఇప్పటికే సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉన్న హిందువులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడంలేదు. అంతేకాదు.. యుక్తవయస్సుకు వచ్చిన ఆడపిల్లలను అపహరించుకుపోవడం.. బలవంతంగా మతం మార్చి వివాహాలు చేసుకుంటుండటంతో.. మైనార్టీలుగా ఉన్న హిందూ కుటుంబాలు అస్తవ్యస్తమవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుండటం కలకలం రేపుతోంది.