ఇంత దారుణమా..? హిందూ కుటుంబాలను టార్గెట్‌ చేస్తూ దాడి, ఇళ్లు ధ్వంసం.. ఇలా అయితే అక్కడ బతికేదెట్లా..?

Spread the love

మొన్నటి వరకు పాక్‌లోనే హిందువుల కష్టాలు చూశాం. కానీ చాప కింద నీరులాగా.. బంగ్లాదేశ్‌లో కూడా మైనార్టీలుగా ఉన్న హిందువుల పరిస్థితి ఘోరంగా మారుతోంది. పక్కా స్కెచ్‌ వేస్తూ.. హిందూ కుటుంబాలను టార్గెట్‌ చేస్తున్నాయి బంగ్లాకు చెందిన ఇస్లాం సంస్థలు. ఓ వైపు హిందూ యువతులను అపహరించుకు పోవడం.. మరోవైపు దేవాలయాలపై దాడులు చేయడం రెగ్యులర్‌గా జరుగుతోంది. ఇక తాజాగా.. హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులకు పాల్పడటమే కాకుండా.. వారి ఇండ్లను కూడా ధ్వంసం చేస్తున్నారు.

తాజాగా.. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఘర్షణలు.. బంగ్లాలోని హిందువులకు శాపంగా మారింది. సోషల్ మీడియాలో ఇస్లాం గురించి పోస్టు పెట్టారన్న ఆరోపణలతో హిందూ కుటుంబాలపై దాడికి దిగారు. బంగ్లాదేశ్‌లోని కొమిల్లా జిల్లా ముర్దానగర్‌ ప్రాంతంలోని కొర్బన్‌పూర్‌లో ఆదివారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒకే సారి రాడికల్ ఇస్లాం వాదులు మూకదాడికి దిగడంతో అక్కడి వారంతా ప్రాణభయంతో వణికిపోయారు. దాడికి దిగడమే కాకుండా.. వారి నివాస గృహాలను అగ్నికి ఆహుతి చేశారు. ఈ వికృత క్రీడ దాదాపు 5 గంటలపాటు కొనసాగించారు.అయితే అక్కడి పోలీసులు ఇద్దరు స్థానిక హిందూ యువకులనే అరెస్ట్ చేసి.. జైలుకు పంపించారు. కానీ అక్కడ ఉన్న ఏ అధికారి కూడా హిందువులపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయలేదు. కనీసం ఖండించలేదు కూడా.

కుమిల్లా జిల్లా డిప్యూటీ కమిషనర్, ఎండి అబుల్ ఫజల్ మీర్, పోలీసు సూపరింటెండెంట్ సయ్యద్ నూరుల్ ఇస్లాం.. హిందువుల ఇళ్లపై దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. బాధితులపై దాడి చేసిన వారిని గుర్తించి.. అరెస్ట్ చేస్తామన్నారు. సీసీ ఫుటేజీ ద్వారా వారిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రాంతంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నట్లు తెలిపారు.


Spread the love
error: Content is protected !!