పాక్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలను, మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని రేప్లు, కిడ్నాప్లు చేస్తూ.. ఆతర్వాత వారిని బలవంతంగా మతం మార్చి వివాహాలు చేసుకుంటున్నారు. లేనిపక్షంలో వారిని హతమార్చుతున్నారు. ఇది నిత్యం సింధ్ ప్రాంతంలో జరుగుతున్న ఘటనలు.
తాజాగా పొంకి కోహ్లీ అనే ఓ యువతిపై మహ్మద్ తంగ్డీ అనే వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాదు అనంతరం ఆ యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అయితే ఈ ఘటనను గమనించిన గ్రామస్థులు అడ్డుకునేందుకు యత్నించగా వారిపై కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే ఇలా అరెస్టులు చేస్తున్నప్పటికీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక హిందువులు మండిపడుతున్నారు. రేప్ చేసిన అనంతరం కిడ్నాప్ చేసి ఉంటే.. ఇప్పుడు తమ అమ్మాయిని చూసుకోలేకపోయే వాళ్లమని.. ఇలా అపహరించుకుపోయి మతం మార్చి వివాహాలు చేసుకుంటున్నారని బాధితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.