కొడితే కొట్టించుకోవాల్సిందేనా..? అసలు అక్కడి హిందువులపై ఏం జరుగుతోంది..?

Spread the love

వారంతా అక్కడ పనిచేస్తున్నారు. ఇంతలో యజమాని వచ్చాడు. కారణం లేకుండా చితకబాదాడు. దీంతో వారు ఆస్పత్రి పాలయ్యారు. ఇదేంటి రీజన్‌ లేకుండా అంతలా చితకబాదడమేంటి..? అని మనకు అనుమానం రావొచ్చు. కానీ అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై ఇలాంటి ఘటనలు నిత్యకృతమవుతున్నాయి. ఇది జరుగుతుంది మరెక్కడో కాదు.. పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో. సింద్‌ ప్రాంతంలోని సంఘర్‌ ప్రాంతంలో ఉన్న అల్లాహ్‌ బచాయే నిజామని అనే గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇక్కడ నివసించే భీల్‌ కమ్యూనిటీకి చెందిన మాయ భీల్‌, ఉమియా భీల్‌ అనే ఇద్దరు మహిళలపై ఓ భూస్వామి తీవ్రంగా దాడి చేశాడు. వారు పొలంలో గడ్డిని కోస్తుండగా.. అక్కడికి వచ్చిన ఆ భూస్వామి.. వారిపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో వారిద్దరూ ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఈ విషాయన్ని కూడా స్థానికంగా ఉండే కొందరు హిందువులు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిని పాకిస్తాన్‌ హిందూ రెఫ్యూజీ ట్విట్టర్‌ ఖాతా.. పోస్ట్ చేసింది. దీని ద్వారా అక్కడ జరుగుతున్న విషయాలు బాహ్య ప్రపంచానికి కొన్ని మాత్రమే తెలుస్తున్నాయి.

వాస్తవానికి సింధ్ ప్రావిన్స్‌లో హిందువుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఇదే ప్రాంతంలో హిందూ యువతులను టార్గెట్‌ చేస్తూ కిడ్నాప్‌లు, బలవంతపు మతమార్పిడిలు, వివాహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పేదరికంలో ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని హింసిస్తున్నారు. ఈ క్రమంలో వారు మతం మారితేనే బతుకు అన్నట్లు హెచ్చరిస్తుండటంతో అనేక మంది భయబ్రాంతులకు గురవుతూ సామూహికంగా ఇస్లాంలోకి మతమార్పిడి అవుతున్నారు.


Spread the love
error: Content is protected !!