పాక్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఓ వైపు మైనర్ హిందూ బాలికలతో పాటు.. యువతులను అపహరించుకు పోయి బలవంతంగా మతమార్పిడులకు పాల్పడుతూ వివాహాలు చేసుకుంటున్నారు. ఇక మరోవైపు హిందూ కుటుంబాలపై దాడులకు దిగుతూ ఆస్తుల నష్టం చేస్తున్నారు. ఇక తాజాగా.. పాక్లో ఉన్న హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తున్న ఘటనలు చూస్తే.. హిందువుల మనుగడకే ప్రశ్నార్ధకంగా మారాయి.
వివరాల్లోకి వెళితే.. పాక్లోని కరాచీ సమీపంలో ఉన్న లియారి ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి సాలార్ కంపౌండ్లో చోటుచేసుకుంది. కుక్కపై మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా రాశారంటూ ఆరోపిస్తూ.. స్థానిక ముస్లిం మూకలు హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయంలో ఉన్న విగ్రహాలను పగులగొట్టడమే కాకుండా.. బయట విసిరేస్తూ పూర్తిగా ధ్వంసం చేశారు. దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు.
తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే.. పాక్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందన్నది అర్ధమవుతోంది. ఆలయంపై దాడి జరిగినప్పటి నుంచి స్థానిక పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని అక్కడి విలేకరులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతమంతా.. కరాచీ పోలీసులు, రేంజర్లను మోహరించి ఉంది. కాగా, గత కొద్ది రోజులుగా పాక్ లోని హిందూ ఆలయాలే లక్ష్యంగా ఘటనలు జరుగుతున్నాయి. గడిచిన 20 రోజుల్లో మూడు ప్రధాన ఆలయాలపై దాడులు జరగడం ఆందోళన కల్గిస్తోంది.
#Breaking
Attack on Hindu temple by M0zleums of karachi NapakstanAn ancient Hindu temple is demolished, Hindu Gods & relics thrown out, desecrated in Lee market, Sheetal Das Ground, Bheempura Karachi- Pakistan.
This is 3rd incident of desecration of Hindu temples in 20 days pic.twitter.com/ISI3RstEOQ
— Defence360 (@Defence_360) November 2, 2020