పాక్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. ఓ వైపు ఇమ్రాన్ సర్కార్ వివక్ష చూపు.. మరోవైపు అతివాద ఇస్లామిక్ గ్రూపులు.. ఇలా అన్ని రకాలుగా హిందువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మైనార్టీలుగా ఉన్న హిందూ, సిక్కు, క్రైస్తవ మతాలకు చెందిన యువతులను, స్త్రీలను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్లు చేస్తూ. .ఆ తర్వాత వారిని బలవంతంగా మత మార్పిడి చేయడం.. వివాహాలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఓ ఎన్జీవో సంస్థ సర్వే ప్రకారం.. ప్రతి ఏటా వెయ్యి మందికి పైగా హిందూ యువతులను కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి చేస్తున్నారని.. ఆ తర్వాత వారిని ముస్లిం యువకులు, పురుషులు వివాహాలు చేసుకుంటున్నారని తెలిపింది.
తాజాగా.. సింధ్ ప్రాంతంలో ఏకంగా హిందూ కుటుంబాలను సామూహిక మతమార్పిడి చేసినట్లు తెలుస్తోంది. పాక్ మానవ హక్కుల కార్యకర్త రహత్ ఆస్టిన్ తన ట్విట్టర్లో దీనికి సంబంధించిన వార్తను పోస్ట్ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సింధ్ ప్రాంతంలోని భిల్ వర్గానికి చెందిన 171 మంది హిందువులు బలవంతంగా ఇస్లాం మతం పుచ్చుకున్నారని తెలిపారు. వీరిలో పురుషులతో పాటు.. స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. సింధ్ ప్రావిన్స్లోని సంన్గర్లో ఉన్న అహ్సన్ ఉల్ తలీమ్ మదర్సాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇస్లామిక్ ఐడియాలజీ కౌన్సిల్ మాజీ సభ్యుడు నూర్ అహ్మద్ తాషర్ ఆధ్వర్యంలో ఈ మతమార్పిడి జరిగింది. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా తెలిపింది.
అయితే మైనార్టీల్లో పేదలుగా ఉన్న వారితో పాటు.. బలహీన వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బులను కూడా ఇస్తూ బలవంతపు మతమార్పిడిలకు దిగుతున్నారని సమాచారం.
సింధ్ ప్రావిన్స్లో ఘోరం.. మతమార్పిడి.. ఆలయం ధ్వంసం చేసి.. ఆపై..
పాక్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలోనే కాస్త ఎక్కువగా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకుని పాక్లోని ముస్లింలు మైనార్టీలపై దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక పౌరహక్కుల సంఘం నేత ఒకరు ట్విట్టర్ ద్వారా తెలిపారు. సింధ్ ప్రావిన్స్లోని గోలార్చి జిల్లాలో ఈ ఏడాది జూన్లో పెద్ద ఎత్తున మతమార్పిడులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావంతో లాక్డౌన్ కారణంగా ఎంతో మంది హిందువులు,సిక్కులు, క్రైస్తవులు ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వం కూడా వీరిని పట్టించుకోక పోవడంతో పాటు.. సహాయం చేసేందుకు వచ్చిన ఎన్జీవోలను కూడా అడ్డుకుని.. కనీసం రేషన్ సరుకులను కూడా అందజేయలేదని.. పలు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలిసింది.
అయితే ఈ క్రమంలో మైనార్టీలుగా ఉన్న హిందువులను పెద్ద ఎత్తున ఇస్లాంలోకి మతం మార్చినట్లు తెలుస్తోంది. జూన్ నెలలో దాదాపు 102 మంది హిందువులను ఇస్లాం మతంలోకి మార్చారని.. అంతటితో ఆగకుండా అక్కడ ఉన్న స్థానిక దేవాలయాన్ని ధ్వంస చేశారని సమాచారం. అంతేకాదు ఆ ఆలయంలో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసి.. దానిని మసీదుగా మార్చారని తెలుస్తోంది.
నిత్యం జరుగుతున్న వరుస దాడులతో కొందరు భయంతో మతం మారుతున్నారని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడి మైనార్టీల జీవనం కొనసాగుతోందని తెలుస్తోంది. ఇక్కడ జీవనం సాగించాలంటే ఇస్లాం పుచ్చుకోవడం తప్ప.. మరో మార్గం లేదని భావిస్తూ ఇలా మతం మారుతున్నట్లు తెలుస్తోంది.