కేసీఆర్‌ సర్కార్ వేసిన రూ.1500/- పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..!

Spread the love

కరోనా ప్రభావంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేవలం అత్యవసర సర్వీసులకు మినహా.. మిగతవన్నీ మూతపడ్డాయి. దీంతో సామన్యా ప్రజానీకం ఉపాది లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తొలుత ప్రధాన మంత్రి జన్‌ ధన్ ఖాతా కలిగిన మహిళలందరికీ వారి వారి బ్యాంకు అకౌంట్లలో రూ.1500/- జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ ప్రకటించింది. అందులో భాగంగా తొలివిడతగా ఏప్రిల్‌ మాసానికి గాను.. రూ.500/- జమ చేసింది. ఇక మిగతా రెండు విడతలు మే, జూన్‌ నెలల్లో జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా రేషన్ కార్డు దారులందరికీ రూ.1500/- ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కార్డు హోల్డర్‌ లందరికీ రూ.1500/- జమ చేశారు. అయితే వీరిలో కొందరికి టెక్నికల్ ఇష్యూ ద్వారా పడనట్లు తెలుస్తోంది.

అయితే ఎంతో మంది ప్రజలు వారి అకౌంట్లలో ప్రభుత్వం జమచేసిన నగదు క్రెడిట్ అయ్యిందా… లేదా అన్నదానిపై అనుమానాలున్నాయి. కొందరు బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకుంటూ.. పడిన వారు డబ్బుల్ని డ్రా చేసుకుంటున్నారు. ఇక మరికొందరు మొబైల్ యాప్‌ ఉన్న వారు అలా చెక్ చేసుకుంటున్నారు. అయితే బ్యాంకు యాప్ లేని వారు, బ్యాంకుకు వెళ్ల లేని వారు వారి అకౌంట్‌లలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వం Epos.telangana.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత..DBTResponse Status Check అని ఉన్న లింక్‌ను క్లిక్‌ చేసి.. ఆ తర్వాత అందులో రేషన్ కార్డు నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.  ఆ తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేస్తే.. ఏ రోజు అకౌంట్లో డబ్బులు జమా అయ్యాయో అన్న సమాచారం తెలుస్తోంది. కింద ఉన్న లింక్‌ను క్లిక్‌ చేసి.. మీ రేషన్ కార్డు నంబర్‌ను ఎంటర్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

https://epos.telangana.gov.in/ePoS/DBTResponseStatusReport.html


Spread the love
error: Content is protected !!