రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం.. ఇక రోజు వారీగా..

Spread the love

కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక రోజు వారీగా వార్తలను చదువుతానని తెలిపారు. అదేదో న్యూస్ ఛానెల్ లో కూర్చొని న్యూస్ రీడర్ మాదిరి మాత్రం కాదు. ఆయన తన సోషల్ మీడియా వేదికగా వీడియోలో న్యూస్ చదువుతారట. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాదు తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా కారణాల్ని తెలిపారు.

ప్రస్తుతం దేశంలో ఉన్న మీడియా ఛానెల్స్ అన్నీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయని.. నిజాల్ని చెప్పడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో వాస్తావలపై వీడియో సందేశాలను అందజేస్తానంటూ.. దానిపై చర్చలు కూడా చేస్తానని తెలిపారు. అంతేకాదు.. దేశ ప్రజల పరిస్థితులపై కానీ.. వారి అవసరాల గురించి కానీ పట్టించుకోవడం లేదంటూ గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియాను తానే అవుతానంటూ రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక నుంచి కరెంట్ ఎఫైర్స్, హిస్టరీ, సంక్షోభాలకు సంబంధించి వీడియో మెసెజ్ లను చేస్తూ తన అభిప్రాయలను షేర్ చేసుకుంటానని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.


Spread the love
error: Content is protected !!