శివుడికి ఇలా పూజ చేస్తే.. మీ అన్ని ఇబ్బందులు ఇట్టే మాయం అవుతాయి..

Spread the love

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంతా అంటారు. శివుడి ని అనేక రకాల పేర్లతో పూజిస్తుంటారు. అంతే కాదు శివుడిని లయకారుడు, భోళా శంకరుడు, త్రినేత్రుడు,ముక్కంటి అని కూడా అంటారు. అష్టదిక్పాలకులు అధిపతి కూడా ఆ మహేశ్వరుడు అని అంటారు. అంతేకాదు నవగ్రహాలకు అధిపతి కూడా శివుడే అని అంటారు. అందుకే ఆ భోలశంకరుడి ఆశీస్సులు మనపై ఉంటే అన్ని ఇబ్బందులు ఇట్టే సమసిపోతాయని నమ్మకం. ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నాయని భావిస్తున్నా… శివుడ్ని పూజిస్తే తొలగిపోతాయి. అయితే ఆ పరమ శివునికి సోమవారం అంటే చాలా ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం శివుడికి పూజలు చేస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం.

శివుడిని ఈ విధంగా పూజిస్తే సత్ఫలితాలు కలుగుతాయని అంటారు.

* సోమవారం ముందుగా తలస్నానం చేసి.. పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం బొట్టుపెట్టి.. దీపారాధన చెయ్యాలి.

* తుమ్మి పూలు,మోదుగు పూలతో శివుడికి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. లేని పక్షంలో ఏవైనా పువ్వులతో పూజ చేయాలి.

* అనంతరం శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించాలి. అనంతరం ఆ విభూతిని నుదిటిన ధరించాలి.

* సాయంత్రం వరకు ఉపవాసం ఉండి.. అనంతరం శివాలయానికి వెళ్లి ఆవు నెయ్యి తో దీపారాధన చేయాలి. ఉపవాస సమయంలో పాలు,పండ్లు తీసుకోవచ్చు.

* సాయంత్రం పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం( పెరుగన్నం ) సమర్పించాలి.
ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి.

* బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుందంటారు.

* ఇక శివుడికి ఏ పండైనా ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుందంటారు. ఈ పండుని పరమశివుడికి సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది.
* సోమవారం ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!