శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంతా అంటారు. శివుడి ని అనేక రకాల పేర్లతో పూజిస్తుంటారు. అంతే కాదు శివుడిని లయకారుడు, భోళా శంకరుడు, త్రినేత్రుడు,ముక్కంటి అని కూడా అంటారు. అష్టదిక్పాలకులు అధిపతి కూడా ఆ మహేశ్వరుడు అని అంటారు. అంతేకాదు నవగ్రహాలకు అధిపతి కూడా శివుడే అని అంటారు. అందుకే ఆ భోలశంకరుడి ఆశీస్సులు మనపై ఉంటే అన్ని ఇబ్బందులు ఇట్టే సమసిపోతాయని నమ్మకం. ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నాయని భావిస్తున్నా… శివుడ్ని పూజిస్తే తొలగిపోతాయి. అయితే ఆ పరమ శివునికి సోమవారం అంటే చాలా ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం శివుడికి పూజలు చేస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం.
శివుడిని ఈ విధంగా పూజిస్తే సత్ఫలితాలు కలుగుతాయని అంటారు.
* సోమవారం ముందుగా తలస్నానం చేసి.. పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం బొట్టుపెట్టి.. దీపారాధన చెయ్యాలి.
* తుమ్మి పూలు,మోదుగు పూలతో శివుడికి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. లేని పక్షంలో ఏవైనా పువ్వులతో పూజ చేయాలి.
* అనంతరం శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించాలి. అనంతరం ఆ విభూతిని నుదిటిన ధరించాలి.
* సాయంత్రం వరకు ఉపవాసం ఉండి.. అనంతరం శివాలయానికి వెళ్లి ఆవు నెయ్యి తో దీపారాధన చేయాలి. ఉపవాస సమయంలో పాలు,పండ్లు తీసుకోవచ్చు.
* సాయంత్రం పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం( పెరుగన్నం ) సమర్పించాలి.
ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి.
* బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుందంటారు.
* ఇక శివుడికి ఏ పండైనా ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుందంటారు. ఈ పండుని పరమశివుడికి సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది.
* సోమవారం ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది.