CAA.. citizenship amendment act.. పౌరసత్వ సవరణ చట్టం.. గతేడాది డిసెంబర్లో కేంద్ర ఈ చట్టాన్ని సవరించింది. అప్పటినుండి దేశంలో ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలు, ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కారణం ఏంటంటే.. ఈ caa వల్ల దేశంలో ఉన్న ముస్లింలకు ఇబ్బందులు కలుగుతాయని.. దీనివల్ల ముస్లింలు హక్కులు కోల్పోతారని ప్రచారం జోరందుకుంది.ఇక అటు విపక్షాలు కూడా చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సినబాధ్యత మరచి.. వారిని రెచ్చగొట్టేలా వ్యవహరించే విధంగా చేశాయి.వాస్తవానికి దేశంలో ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ ఈ CAA ముసుగు లో నిరసనల పేరుతో పలుచోట్ల హింస చెలరేగింది. ఢిల్లీ లో అయితే ఏకంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇంతకు ఈ CAA చట్టం ద్వారా ఎవరు లాభం పొందుతారు.? ఎవరికి నష్టం కలుగుతుంది.?
ఫైనల్ గా ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది..? అన్న ప్రకారం చూస్తే..
*మొదట ఈ చట్టం దేశంలో ఉన్న ఏ పౌరుడికి నష్టం కలగచేయదు.
*ఈ చట్టం కేవలం పాకిస్థాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోని మైనారిటీలకు పౌరసత్వం కల్పిస్తుంది.
* ఈ మూడు దేశాలకు చెందిన హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్కు, పార్సీ లకు మాత్రమే వర్తిస్తుంది.
* అది కూడా 2014 కంటే ముందు భారత్ లో నివసించేవారికి మాత్రమే వర్తిస్తుంది.
* ఇక ఈ పౌరసత్వ చట్టం తీసుకోండి అంటూ శరణార్థుల దగ్గరికి ఎవరు ఏం వెళ్లరు.
* పౌరసత్వం పొందాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
కేంద్రం లెక్కల ప్రకారం అధికారికంగా లబ్ది పొందేది వీరే..!
CAA చట్టం గురించి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన లెక్కల ప్రకారం..
ఈ caa వల్ల లబ్ది పొందేది కేవలం 32వేల లోపే..
ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్టు ఆధారంగా..
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ కు వచ్చిన మైనారార్టీలు ఎంతమందంటే..
హిందువులు – 25,447
సిక్కులు – 5087
క్రిస్టియన్లు -55
పార్శిలు -2
బుద్దిస్టులు -2
మొత్తం–31,313 మంది మాత్రమే.
అయితే వీరంతా అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. ఇక మరికొంత మంది బంగ్లాదేశ్ నుండి ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే హిందువులు మరికొంత మంది అంతా కలుపుకుంటే మరో 50 వేల మంది కూడా ఉండరని తెలుస్తుంది. అయితే ఈ చట్టంలో ఎక్కడ కూడా దేశ పౌరుల హక్కులు కోల్పోయే అవకాశం లేదు. ఆయితే మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం సరైంది కాదని.. కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి.