కరోనా.. ఈ వైరస్ పేరు చెబితే చాలు.. ప్రపంచ దేశాలన్నీ గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ సోకి రెండు బిలయన్ల మంది ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదు లక్షల మంది వరకు ఈ మహమ్మారి జయించి బయటపడ్డారు. ఈ వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. ఈ వైరస్ విజృంభిస్తోంది. అయితే మన దేశంలో తయారవుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంజీవనిగా మారింది.కరోనాతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు.. భారత్ పెద్దదిక్కుగా మారింది. కరోనాను కట్టడి చేసేందకు సమర్ధవంతంగా పనిచేస్తోన్న ఈ “హైడ్రాక్సీ క్లోరోక్విన్”ను ప్రస్తుతం భారత్ ప్రపంచంలోని 55 దేశాలకు సప్లై చేస్తోంది.
యాంటీ మలేరియా డ్రగ్ అయిన ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్.. ప్రోడక్షన్లో మన భారతదేశమే అగ్రస్థానంలో ఉంది. కరోనా బారినపడ్డ వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడటంలో.. ఈ హైగ్రాక్సీ క్లోరోక్విన్ ఉపయోగపడుతుందని వైద్య నిపుణుల అభిప్రాయం. అయితే తొలుత ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్.. మెడిసిన్ను విదేశాలకు ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే అనేక దేశాలు ఈ మెడిసిన్ కోసం భారత్వైపు చూపులు చూస్తుండటంతో.. ఆ తర్వాత విదేశాలకు ఎగుమతిచేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా ఈ మెడిసిన్ కావాలంటూ.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా మోదీని కోరిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ను భారత్ మొత్తం 55 దేశాలకు సప్లై చేస్తోంది. ఇందులో ఎక్కువ దేశాలకు సహాయంగానే అందిస్తోంది. కేవలం 21 దేశాలకు మాత్రమే.. అమ్ముతోంది. అమెరికా, బ్రెజిల్, ఇజ్రాయెల్తోపాటుగా.. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, మారిషస్ దేశాలకు ఈ హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మెడిసిన్ను సప్లై చేస్తోంది.
ఇక సార్క్ దేశాలైన ఆఫ్ఘన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంకతో పాటుగా.. మయన్మార్కు కూడా దీనిని పంపిస్తోంది. అంతేకాదు.. అరబ్బు దేశాలైనా యూఏఈ.. ఒమన్తోపాటు.. సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఉగాండా, ఈజిప్ట్, జమైకా, ఉజ్జెకిస్థాన్, ఉక్రెయిన్ తదితర దేశాలకు కూడా అందిస్తోంది. ఇక మొన్నటి వరకు పాకిస్థాన్కు వత్తాసు పలికిన మలేషియాకు కూడా.. ఈ హైక్రాక్సి క్లోరోక్విన్ పంపించేందుకు భారత్ ఓకే చెప్పింది. కష్ట కాలంలో ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న సమయంలో.. ఇప్పుడు భారత్ ఆపన్న హస్తాన్ని అందిస్తూ.. ప్రపంచానికి సంజీవనిగా మారింది. ఈ కరోనాతో మన దేశం కూడా ఇబ్బందులు పడుతోంది. మరోవైపు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అగ్రదేశాలన్నీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భారత్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.