మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తారో అందరికి తెలిసిందే .. ఆయనకు ఉన్న ఫాలోవర్స్ చూస్తే షాక్ తినాల్సిందే . అగ్ర రాజ్య అధినేతకంటే కూడా మన మోడీకే ఎక్కువమంది సోషల్ మీడియా అభిమానులు ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇటీవల మోడీ తన సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ అన్నింటి నుండి మార్చ్ 8నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. దీంతో యావత్ భారతమే కాకుండా .. సోషల్ మీడియా “సి.ఈ .ఓ”లు సైతం షాక్ కు గురయ్యారు . అయితే మోడీ ప్రకటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం గురువారం టెక్ మహీంద్రా సీటీఓ, జాతీయ భద్రతా నిపుణుడు అమిత్ దుబే ప్రకటనతో మోడీ ప్లాన్ అర్థమైంది.
మోడీ అసలు విదేశీ సోషల్ మీడియా కు చెక్ పేట్టేందుకే ఇటీవల తన అధికారిక పేస్ బుక్ ,ట్విట్టర్ ,ఇంస్టాగ్రామ్ లను వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఈ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ,ఫేక్ వార్తలను నియంత్రించడంలో విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఇటీవల పౌర సత్వ సవరణ చట్టం విషయంలో దేశంలో తప్పుడు వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి . ఈ ఫేక్ న్యూస్ ను అరికట్టడంలో ఫెయిల్ అయినట్లు మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో స్వదేశీ సోషల్ మీడియా యాప్ లను అభివృద్ధి చేసేందుకు నడుం బిగించినట్లు అర్ధమవుతుంది. సొంత సోషల్ మీడియాను రూపొందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ప్రపంచ వ్యాప్తంగా .. హ్యాకింగ్, డేటా చోరీలు ఎక్కువవుతున్న నేపథ్యంలో భారత్ సొంత సామాజిక మాధ్యమాలను తయారుచేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు అమిత్ దుబే తెలిపారు. దేశంలో సొంత ఫేస్బుక్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్ వంటి వాటిని రూపకల్పన చేయడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాకు సంబంధించిన కసరత్తు పూర్తయ్యిందన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన ఓ డ్రాఫ్ట్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందన్నారు. సొంత సోషల్ మీడియాను రూపొందించే దేశాలలో పొరుగు దేశమైన చైనా ఫస్ట్ ప్లేసులో ఉందన్నారు. అయితే అక్కడ వాట్సాప్, ఫేస్బుక్ పనిచేయదన్న విషయాన్నీ దుబే తెలిపారు.