బిగ్‌ న్యూస్‌.. రూ.3 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్‌ చేసిన ఇండియన్‌ నేవీ

Spread the love

భారత నావికాదళం సోమవారం నాడు ఓ భారీ ఆపరేషన్‌ నిర్వహించింది. అరేబియా సముద్రంలో ఐఎన్‌ఎస్‌ సువర్ణ చేత చేపట్టిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను సీజ్‌ చేసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. కొచ్చి ఓడరేవు సమీపంలో ఈ ఘటన చోటచేసుకుంది. తొలుత ఫిషింగ్‌ బోటుగా భావించినప్పటికీ.. అనుమానంతో ఐఎన్ఎస్ సువర్ణ చేత సీజ్‌ చేయగా.. అందులో పెద్ద ఎత్తున నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు నేవీ సిబ్బంది గుర్తించారు. 300 కిలోల నార్కొటిక్‌ పదార్ధాలు ఉన్నాయని.. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ రూ.3వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ పడవను సీజ్‌ చేసి కేరళలోని కొచ్చి ఓడరేవుకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏఎన్‌ఐ న్యూస్‌ ఏజెన్సీ ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది.

 


Spread the love
error: Content is protected !!